కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు  ఎవరూ అంటే కార్తి అనే చెప్పాలి. 'యుగానికి ఒక్కడు' సినిమా నుండి ఇటీవలే విడుదలైన 'పొన్నియన్‌ సెల్వన్‌' వరకు ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతూ వస్తున్నాయి మరీ

కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో  కూడా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి.   తెలుగులో కార్తికు టాలీవుడ్‌ టైర్‌2 హీరోలకున్నంత క్రేజ్  కూడా ఉంది. అయితే ‘ఖైదీ’ తర్వాత ఈయన నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టిన విషయం మనకు తెలిసిందే, . ఈ క్రమంలో ఈ ఏడాది ‘విరుమన్‌’,’PS-1′ సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలు సాధించాడు కార్తి . కాగా ఇప్పుడు ‘సర్దార్‌’తో సందడి చేయడానికి ముస్తాబవుతున్నాడు ఈ నటుడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుసగా ప్రమోషన్‌లు చేస్తూ  చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు.

ప్రమోషన్‌లో భాగంగా కార్తి సినిమా విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను  ఇలా పంచుకున్నాడు. కార్తికు దర్శకత్వం చేయాలని ఆలోచన ఉందని, తొలి చిత్రాన్ని తన అన్నయ్య సూర్యతో చేస్తానని చెప్పాడు. ఎందుకంటే సూర్య తనను బాగా అర్ధం చేసుకుంటాడని, తప్పు చేస్తే అక్కడే చెప్తాడని వెల్లడించాడు. కాగా కార్తి, సూర్య హీరోగా నటించిన ‘యువ’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పనిచేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కార్తి నటించిన ‘సర్దార్‌’ అక్టోబర్‌ 21న రిలీజ్‌ కానుంది. ‘అభిమన్యుడు’, ‘హీరో’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించిన పీ.ఎస్‌ మిత్రన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు మరి . ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, ట్రైలర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ చిత్రంలో కార్తి డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నాడు అని టాక్ . కార్తికి జోడీగా రాశిఖన్నా, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడీయోస్‌ వారి బ్యానర్‌పై నాగార్జున గారు రిలీజ్‌  కు సిద్దం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: