యాంకర్ అనసూయ ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుందని టాక్. ఒకప్పుడు అన్నివిషయాల్లో అడ్జస్ట్‌మెంట్ అయిన ఆమె.. ఈ మధ్య ప్రతి  చిన్న విషయాన్ని రచ్చ రచ్చ చేస్తుందని ఈ బుల్లి తెర నటి
బహుశా దీనికి కారణం తనకు తాను స్టార్ హీరోయిన్ అని ఫీల్ అవ్వడమే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఇలా . అనసూయ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తోంది. అనసూయ ఓ పని మీద బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ఆ సమయంలో తన ఫ్యామిలీ కూడా  తన వెంట ఉంది.

వీరు ప్రయాణించాల్సిన ఎయిర్ లైన్స్ సంస్థ వారు ఫ్లైట్ రన్ వే మీద నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉందని ఫైనల్ కాల్ అనౌన్స్ చేశారు. దీంతో అనసూయ తన కుటుంబంతో సహా పరిగెత్తాల్సినా అవసరం వచ్చింది. తీరా వెళ్లాక ఫ్లైట్ బయలు దేరలేదు కదా వాళ్లు కంగారు పడి మమ్మల్ని ఆగం చేశారని వాపోయింది అనసూయ . విమాన సిబ్బంది వలన అనసూయ ఎదుర్కొన్న ఇబ్బందులను ట్వీట్ రూపంలో తెలియజేసింది. ప్యాసింజర్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎయిర్ లైన్స్ సంస్థకు గట్టిగా నే సూచిస్తూ చాలా స్ట్రాంగ్ మెసేజ్ రాసి పోస్టు చేయడంతో అదికాస్త బాగా వైరల్ అవుతోంది. 'అలయన్స్ ఎయిర్ 9I 517 ప్లైట్ ప్రొటోకాల్‌తో చాలా సిక్ అయ్యాను అని అనసూయ వివరించారు

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు మమ్మల్ని పరుగులు పెట్టించారు. లాస్ట్ కాల్ 6.20 గంటలకు అని అనౌన్స్ చేశారు. కానీ బోర్డింగ్ టైమ్ 18.55 అని టికెట్‌లో మెన్షన్ చేశారు. టేకాఫ్ టైమ్ 19.25 గంటలు. బస్సులో మేం అరగంట వెయిట్ చేశాం అని .విమానం ఆగి ఉండగానే మా పిల్లలతో పరుగులు పెట్టాల్సి వచ్చింది అని . తీరా వెళ్లాక మాస్క్ కావాలన్నారు.మరల వాళ్లే అవసరం లేదన్నారు.అంత కన్‌ఫ్యూజన్ ఎందుకు. విమానం ఎక్కాక సీట్స్ ఎక్కడెక్కడో ఇచ్చారు. ఆ కంగారులో సీటుకు తగిలి నా షర్ట్ కూడా చిరిగిపోయింది. ప్రయాణీకులకు చెప్పే ముందు మీరు సరిగ్గా వారితో వ్యవహరించండి' అంటూ అనసూయ  గట్టిగా నె ఫైర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: