టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో శ్రీరెడ్డి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. ఏదో ఒక విషయంతో రచ్చ చేస్తుంటుంది. ఈ హాట్ బ్యూటీ గతంలో ఒక సారి క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది.అంతే కాకుండా వాటి పై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

ఇకపోతే ఆమె కొందరి నటులను తన నోటికి వచ్చిన మాటలతో బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పోస్టును వైరల్ గా చేస్తుంది. అంతే కాకుండా శ్రీరెడ్డి తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది. రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలదు. ఆమె ఎక్కువగా మెగా ఫ్యామిలీ గురించి విమర్శలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మరోసారి మెగా కుటుంబంపై తన అక్కసు మొత్తం తీర్చుకుంటుంది శ్రీ రెడ్డి.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీరెడ్డి. ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా రెచ్చిపోతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ హాట్ బ్యూటీ యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది. అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.
అయితే కొన్ని నెలల క్రితం నిహారిక ఇష్యూపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ ప్రస్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడిన శ్రీరెడ్డి నాగబాబును కర్మ అనేది చూశావా అని శ్రీ రెడ్డి చెప్పారు. ఆమెను నాగబాబు ఎంతో టార్గెట్ చేశారంటు ఆమె చెప్పుకొచ్చారు. నాగబాబు నన్ను ఎంతో టార్గెట్ చేశాడని ఆమె వెల్లడించారు.ఒక ఆడపిల్లని అయిన నన్ను వైసీపీలో ఉన్న లేడీస్ ను నాగబాబు ఘోరంగా కామెంట్లు చేశారని ఆమె తెలిపారు. నేను శక్తిని కాకపోయినా నేను పూజించే అమ్మవారు శక్తి అని శ్రీరెడ్డి వెల్లడించారు. నాగబాబు తన సొంత ఛానల్స్ ద్వారా తన గురించి తప్పుగా ప్రచారం చేశారని ఆమె అన్నారు. పబ్ లకు వెళ్లడం అది కూడా మూడు గంటల సమయంలో అది ఉగాది రోజున భర్త లేకుండా నిహారిక వెళ్లడం కరెక్టేనా అని ఆమె ప్రశ్నించారు.
శ్రీరెడ్డి రామ్ చరణ్ ని కూడా వదలలేదు. అతని భార్య మెగా కోడలు అయిన ఉపాసన కొణిదెలను కూడా వదల్లేదు ఈ వివాదాస్పద సుందరి. ఆమె ఉపాసన గురించి అనుచితమైన మాటలు మాట్లాడింది. అసలు ఉపాసన లేకపోతే మీ కుటుంబమే ఉండేది కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా నిహారిక విషయంలో కూడా రామ్ చరణ్ ను దూషిస్తూ పరుష పదజాలంతో అతన్ని ఓ ఆట ఆడుకుంది.పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడతారని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు. హిందూ కల్చర్ గురించి మాట్లాడే పవన్ ఇప్పుడు ఏం చెబుతారని ఆమె ప్రశ్నించారు. నీతులు చెప్పే నాగబాబు కూతురును ఇలా పెంచడం ఏమిటని శ్రీరెడ్డి వెల్లడించారు. నా తల్లిదండ్రులు కూడా ఇలానే బాధపడి ఉంటారని శ్రీరెడ్డి అన్నారు. నాగబాబుకు ఇది శాంపిల్ మాత్రమే అని ఇంకా నాగబాబు అనుభవిస్తాడని ఆమె వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: