వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ "వెల్కమ్ టు తీహార్ కాలేజ్డాక్టర్ ఎల్ ఎన్ రావు, యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో విద్య పేరుతో జరుగుతున్న అరాచకాన్ని సునిశిత హాస్యంతో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రం బృందం మీడియా సమావేశంలో మాట్లాడారు.హీరో మనోజ్ నందన్ మాట్లాడుతూ.. ''వెల్కమ్ టు తిహార్ కాలేజ్'' అనే సినిమా నా కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ . సునీల్ కుమార్ రెడ్డి కథ చెప్పినప్పుడు ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలోని అంశాలు నాకు కళ్ళకు కట్టినట్టు అర్థమయ్యాయి. లాక్ డౌన్ ముందు ఈ సినిమాని మొదలుపెట్టాం. ఈ సినిమా కోసం చాలామంది స్టూడెంట్స్ ప్రాక్టికల్ ఫీడ్ బ్యాక్ ని తీసుకొని.. అవే అంశాల్ని సినిమాలో చూపించాము. ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంని అలాగే ప్రైవేటు రంగంలో చేస్తున్న మోసాలు కళ్ళకు కట్టినట్టు చూపించాము. అక్టోబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. మా సినిమాని స్టూడెంట్స్, పేరెంట్స్ ప్రత్యేకంగా చూడాలని.. అలాగే మా సినిమా చూసిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోకొంచమైనా మార్పులు వస్తాయని ఆశిస్తున్నాను" అని తెలిపాడు.హీరోయిన్ సోనీ రెడ్డి మాట్లాడుతూ.. "వెల్కమ్ టు బీహార్ కాలేజ్ అనే సినిమా 2019లో మొదలైంది. ఆ టైంలో నేను ఇంటర్ చదువుతున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. నా మొదటి సినిమా ఇదే అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంటర్ చదివే టైంలో ఫేస్ చేసినటువంటి అనేక అనుభవాలు, ఘటనలు ఈ సినిమాలో డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి చూపించారు" అని చెప్పింది.
ఫణి చక్రవర్తి మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నేను కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించేందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. వెల్కమ్ టు బీహార్ కాలేజ్ అనే సినిమా మా సినిమా కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని.. ఈ సినిమాలో నేను నటించేటప్పుడు చాలా ప్రౌడ్ గా.. హ్యాపీ గా ఫీల్ అవుతూ చేశాను. మా సినిమాను ప్రేక్షకులు అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. "బతకడానికి ధైర్యం ఇవ్వాల్సిన చదువే చావడానికి కారణం అవుతుంది. ఇంతకన్నా దురదృష్టం ఇంకోటి లేదు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మన ఎడ్యుకేషన్ సిస్టం ఎంత ఫెయిల్యూర్ లో ఉందో, నేను గతంలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేసినప్పుడు స్టూడెంట్స్ మైండ్ సెట్ ని అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను అనుకున్న కథ అనుకున్నట్టుగా తీయగలిగాను. ఈ సినిమా చూసి ఏ ఒక్క స్టూడెంట్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోకుండా తన భవిష్యత్తు,కుటుంబం, మనోధైర్యాన్ని నిలబెట్టుకోవాలి అని కోరుకుంటున్నాను. అలానే అక్టోబర్ 28న విడుదలయ్యే మా సినిమా విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యం, ప్రేక్షకులు, ప్రతి ఒక్కరు చూసిమా సినిమాను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్
బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్
నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా, వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు.
కెమెరా మాన్ & ఎడిటింగ్ : సాబు జేమ్స్
సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.
కలరింగ్ అమల్
వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ
పి ఆర్ ఓ : పాల్ పవన్
సౌండ్ మిక్సింగ్: పద్మారావునిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు
దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: