సినిమా పరిశ్రమలో సక్సెస్ లు కొట్టడం ఫెయిల్యూర్ లు అందుకోవడం అనేది ఎంతో సాధారణమైన విషయం. అయినా కొంతమంది హీరోలు సక్సెస్ ను ఆస్వాదించినంత ఈజీగా ఫెయిల్యూర్ ను ఆస్వాదించలేకపోతుంటారు. దాని ద్వారా డిప్రెషన్ కి వెళ్లిపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం కొన్ని రోజులు ఇంట్లోనే ఉండకపోవడం వంటివి చేస్తూ రకరకాలుగా వారి ఫ్రస్టేషన్ పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు చాలామంది హీరోలు ఫ్లాప్ వచ్చిన తర్వాత ఎవరికీ కనబడకుండా వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి.

ఆ తర్వాత అంతా సద్దుమణిగిన తరువాత వారు తిరిగి వచ్చి సినిమాలను చేస్తూ ఉంటారు. అయితే వీరందరికీ భిన్నంగా విజయ్ దేవరకొండ ప్రవర్తించడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా భారీ స్థాయిలో బోల్తా పడింది. లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న కూడా ఏమాత్రం కృంగిపోకుండా తన అభిమానులను నిరాశ పరచకుండా వరుస ఈవెంట్లలో పాల్గొనడం జరుగుతుంది. 

ఆ సినిమాకు ఇచ్చిన హైప్ కి వచ్చిన ఫలితానికి ఏ మాత్రం తేడా లేకపోయినా కూడా ఇంకొక హీరో అయితే ఈ విధంగా చేసి ఉంటే కోలుకోవడానికి చాలా సమయం పట్టి ఉండేది. కానీ విజయ్ దేవరకొండ అందరి లాగా కాదు కాబట్టి ఆయన టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ తనని తాను రిఫరెన్స్ చేసుకుంటున్నాడు. అంతకుముందు ఆయన సైమా అవార్డు ఫంక్షన్ లో పాల్గొనగా ఈ మధ్య జై జవాన్ అనే ప్రోగ్రాంలో కూడా కనిపించాడు. ఆ తరువాత ప్రిన్స్ ఆడియో వేడుక కు కూడా వచ్చి అందరిని అలరించాడు. నిజంగా అందరి హీరోలు కూడా ఈ విధంగా ఆలోచిస్తే అభిమానులకు నిద్రలేని రాత్రులు ఉండవనే చెప్పాలి.ఇకపోతే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా గా ఖుషి చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా అయినా అయన హిట్ కొడతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: