డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కన్ఫమ్ చేసిన విషయం మనకి తెలిసిందే. చిత్రంపై క్రేజీ అప్డేట్స్ అందుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించబోతున్నట్టు  ఒక టాక్ కూడా ఉంది .

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాల తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదుపరి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నెక్ట్స్ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు  తో ఓకే చేసిన విషయం  మనకి తెలిసిన విషయమే మరి


'ఎస్ఎస్ఎంబీ 29'గా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే చిత్రం స్క్రిప్ట్ వర్క్, నటీనటుల ఎంపికపై దర్శకుడు రాజమౌళి సిరీయస్ గా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా    ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 
తాజాగా అందించిన సమాచారం ప్రకారం.. మహేశ్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించబోతున్నట్టు  మనకు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదే క్రమంలో దీపికా పదుకొణె ఎంపికపై వ్యతిరేకత కూడా వస్తోంది.

 
బాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ దీపికాను.. భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించబోతున్న 'ఎస్ఎస్ఎంబీ 29'లో ఎంపిక చేయడం అవసరమా అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు అంటా మరి . మరోవైపు దీపికా హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలోనే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

 
ఇప్పటికే తమిళ స్టార్ హీరో కార్తీ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్టు  మనకు సమాచారం . హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ అడ్వెంచరస్ గా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ సాహసకుడిగా నేఫథ్యంలో కథ సాగుతుందని రాజమౌళి ఇప్పటికే  ఒక హింట్ ఇచ్చారు. ఆఫ్రీకా అడవుల బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉంటుందని అంటున్నారు.

 
మరోవైపు నిజ జీవితం ఆధారంగా కూడా 'ఎస్ఎస్ఎంబీ 29' రూపుదిద్దుకునే అవకాశం ఉందని  తెగ వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇలా ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతోంది.  .

మరింత సమాచారం తెలుసుకోండి: