కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైంది.


ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కేవలం యాక్షన్ లవర్స్‏ను మాత్రమే ఆకట్టుకోగలిగింది. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.


యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ నవంబర్ 2 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందట. గతంలో నాగార్జున నటించిన వైల్జ్ డాగ్ చిత్రం థియేటర్లలో మెప్పించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ది ఘోస్ట్ కూడా ఓటీటీలో అలరించనుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో విక్రమ్ అనే ఇంటర్ పోల్ అధికారిగా కనిపించారట నాగ్. అతనితో ఉండే ప్రియ అనే అమ్మాయిగా సోనాల్ కనిపించింది. వీరిద్దరు దుబాయ్ లో పనిచేస్తుంటారు. అదే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఒక ఆపరేషన్ లో పాల్గొన్నప్పుడు జరిగిన సంఘటనలో రౌడీ మూక చేతుల్లో చిన్న పిల్లాడు చనిపోతాడు. ఆ సంఘటన విక్రమ్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందట.. మానసికంగా ఎంతో కుంగిపోతాడు. ఆ తర్వాత ప్రియ కూడా అతనికి దూరమవుతుందట..


అయితే అదే సమయంలో అను (గుల్ పనాగ్ ) నుంచి విక్రమ్ కు ఫోన్ వస్తుంది. తననీ.. తన కూతురు అదితిని కాపాడమని కోరుకుంటుంది. దాంతో ఊటీకి బయల్దేరతాడు. ఆ తర్వాత విక్రమ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. అనును.. ఆమె కుటుంబాన్ని కాపాడాడు అనేది ది ఘోస్ట్. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ద్వారా సినీ ప్రియులకు మరింత అందుబాటులోకి వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: