బాలీవుడ్ అయితే హిట్ అనే మాటే విని చాలా కాలం అయింది. తెలుగు సహా కన్నడ, తమిళ సినిమాలు ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బాలీవుడ్ నుంచి సరైన హిట్టు పడి చాలా కాలం అయింది.అలాంటి హిట్టు కోసం బాలీవుడ్ మేకర్స్ అంతా అవిశ్రాంతంగా కృషి చేస్తూ రకరకాల కాంబినేషన్లు సెట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇంత చేస్తున్నా సరే బాలీవుడ్ ప్రేక్షకులందరూ విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏది అంటూ ఒక సర్వే చేస్తే అందులో పుష్ప సెకండ్ పార్ట్ మొదటి స్థానంలో నిలబడింది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ రూపొందించిన పుష్ప పార్ట్ 1 కేవలం తెలుగు సహా దక్షిణాది భాషల్లో మాత్రమే కాదు హిందీలో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సీక్వెల్ మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే బాలీవుడ్ ప్రేక్షకులు అంతా కూడా ఇప్పుడు అత్యధికంగా మిగతా అన్ని సినిమాల కంటే పుష్ప కోసం ఎక్కువ ఎదురుచూస్తున్నట్టు తాజాగా ఒక సర్వేలో తేలింది.

ఆన్లైన్ సర్వేలు చేస్తూ ఉండే ఆర్మాక్స్ మీడియా సంస్థ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇలా 2022 డిసెంబర్ లోపు విడుదలయ్యే అవకాశం లేని బాలీవుడ్ సినిమాల మీద ఒక సర్వే చేయగా అక్టోబర్ 15 వరకు తీసుకున్న వివరాల ప్రకారం పుష్ప అందులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా నటిస్తున్న పఠాన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3వ సినిమా నిలిచింది.

ఇక ఆ తరువాత స్థానంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న  జవాన్ సినిమా నిలవగా ఐదవ స్థానంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డుంకి సినిమా నిలిచింది. మొత్తం మీద టాలీవుడ్ ప్రభావం మాత్రం బాలీవుడ్ మీద గట్టిగానే ఉందనే విషయాన్ని ఈ సర్వే నిరూపిస్తోందని చెప్పక తప్పదు. ఇక అల్లు అర్జున్ పుష్ప తర్వాత షారుఖ్ ఖాన్  సినిమాల కోసమే ఎక్కువగా బాలీవుడ్ జనం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: