పూరి జగన్నాథ్  కెరీర్ లో ఈ మధ్యకాలంలో సరైన హిట్టు పడలేదు. పూరి..విజయ్ కాంబినేషన్ లో విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ అయింది.ఇక  ఈ సినిమా దెబ్బకి పూరి జగన్నాధ్ సైలెంట్ అయిపోయారు. అంతేకాదు ఎంతగానో నమ్మి చేసిన ఈ సినిమా నిరాశ పరిచింది. కనీసం సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. విజయ్ తన పెర్ఫార్మన్స్ నెట్టుకొచ్చేవాడు. సినిమాలో కథ, కథనాలు పేలవంగా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ తో పూరి పరిస్థి దారుణంగా తయారైంది. ఇకపోతే స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. 

మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరికి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక దీంతో పూరి తన కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి.  ఇప్పుడు పూరి దృష్టి బాలీవుడ్ హీరోలపై పడినట్లు తెలుస్తోంది.అయితే రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ లతో టచ్ లోకి వెళ్లారట పూరి జగన్నాథ్.అయితే  ఆగిపోయిందనుకుంటున్న 'జనగణమన' సినిమాను వీరిద్దరిలో ఎవరో ఒకరితో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.ఇక  'లైగర్' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత విజయ్ దేవరకొండతో 'జనగణమన' అనే సినిమాను మొదలుపెట్టారు పూరి జగన్నాథ్.కాగా 'లైగర్' సినిమా డిజాస్టర్ కావడంతో ఇక విజయ్ దేవరకొండ..

పూరితో సినిమా చేయడం లేదని వార్తలొచ్చాయి.అయితే  మొన్నామధ్య 'సైమా' వేడుకల్లో విజయ్ ని ఈ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. ఇక దీంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. కాగా విజయ్ చేయకపోయినా.. బాలీవుడ్ హీరోలతో ఈ సబ్జెక్ట్ తీయాలనుకుంటున్నారట పూరి జగన్నాథ్. అంతేకాదు త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.ఇదిలావుంటే మరోపక్క పూరి ఫైనాన్షియల్ గా వీక్ అయ్యారని వార్తలొస్తున్నాయి. ఇక అందులో నిజం లేదని తెలుస్తోంది. పూరి ఓకే అంటే పెట్టుబడి పెట్టేవారు చాలా మంది ఆయన దగ్గర ఉన్నారట. అయితే అలానే ముంబైలో తీసిన ఆఫీస్ ను 'లైగర్' తరువాత క్లోజ్ చేశారని ప్రచారం జరిగింది.ఇక  అందులో కూడా నిజం లేదని తెలుస్తోంది. కాగా ముంబైలో పూరి ఆఫీస్ అలానే ఉందట . ఇక 'జనగణమన' సినిమా పనులు ఆ ఆఫీస్ నుంచే మొదలుపెట్టారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: