బుల్లితెర స్టార్ రష్మీ అంటే కొందరికి ఎనలేని అభిమానం. ఆమె యాంకరే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్ లో విపరీత ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఓ వైపు టీవీల్లో..మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే రష్మీ పేరు సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా రష్మీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఓ సినిమాలో నటించిన రష్మీ.. ఆ సినిమా ప్రమోషన్స్ చేయాలని పట్టుబడుతున్నారని చెప్పింది. వారి టార్చర్ తట్టుకోలేక ఆ పని చేశానని ఈ ముద్దుగుమ్మ సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ రష్మీ చేసిన పనేంటి..? ఆమెను ఎవరు టార్చర్ పెడుతున్నారు.రష్మీ, నందులు కలిసి 'బొమ్మ బ్లాక్ బస్టర్' అనే సినిమాలో నటించారు. కొన్ని కారణాల వల్ల ఈసినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు నవంబర్ 4న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ష్ కోసం రావాలని నందు రచ్చ చేసిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ కు ఎందుకు రాదు.. ఆమెకు పొగరు అంటూ నందు కామెంట్స్ చేశారు. అయితే ఆ తరువాత ఇది ఫ్రాంక్ వీడియో అన్నారు. కానీ ఇటీవల ఆమె ఇది ఫ్రాంక్ కాదు.. నిజంగానే సినిమా ప్రమోషన్స్ కోసం రానని చెప్పానని రష్మీ బాంబు పేల్చింది.

ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ 'అది ఫ్రాంక్ వీడియో కాదు.. నిజంగానే నేను ప్రమోషన్స్ కు రానని చెప్పా.. సినిమా పూర్తయి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు దాని గురించి అప్డేట్ లేదు. సడెన్లీగా వచ్చి సినిమా ప్రమోషన్స్ కోసం రావాలి అంటే ఎలా.. నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పా.. అయినా వినకుండా మెసేజ్లు, ఫోన్స్ చేసిన టార్చర్ పెట్టారు. ఆ బాధ భరించలేకే సినిమా ప్రమోషన్స్ కు రానని చెప్పా'అని వివరించింది.అలాగే సినిమా ప్రమోషన్స్ కు వస్తే నాకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి.. వాటికి సమాధానం చెప్పడం నాకు ఇష్టం లేదు..' అని అయితే రష్మీ చెప్పింది. దీంతో నెటిజన్లు రష్మీ చేసిన కామెంట్స్ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు చెప్పే ఆ రకరకాల ప్రశ్నలు అంటే.. ఒకటి సుధీర్ తో పెళ్లి .. మరొకటి అనసూయ ప్లేసులో మీరు రావడం.. వంటివి ఉన్నాయి' అని మెసేజ్ లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: