డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్గా నటిస్తున్నది. అమితాబచ్చన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దాదాపుగా ఈ చిత్రం రూ.500 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం కూడా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు అని సమాచారం. కాబట్టి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి తప్పకుండా అబ్బురపరిచే అప్డేట్ వస్తుందని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు కానీ ఊహించని విధంగా ఒక హ్యాండ్ ఇచ్చారుగా అనే కామెంట్స్ తగ్గట్టుగా వినిపిస్తున్నాయి.
ఇక ఒక పోస్టర్ని విడుదల చేయగా ఇందులో ఐరన్ మ్యాన్ చేయితరహాలో డిజైన్ చేయబడి ఉన్నది. ఆ పోస్టర్ లో ఎమి ఉందని చూడాలని మరికొంతమంది అభిమానులు తీవ్రంగా అసంతృప్తిని తెలియజేస్తున్నారు. కనీసం వైజయంతి వాళ్ళయినా ఏదో విధంగా ఆకట్టుకుంటారు అనుకుంటే వీరు కూడా పెద్ద కిక్కేం ఇవ్వలేదని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా పెద్ద ప్రాజెక్టు నుంచి ఇలాంటి అప్డేట్ ఎవరూ ఊహించలేదని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 45 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిందని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తన ఫేస్ కనిపించే విధంగా ఏదైనా స్టిల్ విడుదల చేస్తారని అనుకోగా కేవలం ఒక ఐరన్ మ్యాన్ చేయని విడుదల చేశారని వార్తలు వినిపిస్తున్నాయి