కన్నడ సూపర్ స్టార్ గా పేరుపొందిన కిచ్చ సుదీప్ ప్రతి ఒక్కరికి సుపరచితమే మొదట ఈగ సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ విరామం నుంచి బయటికి వచ్చి తన భార్యతో కలిసి వివాహ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. అందుకోసం ఆస్ట్రేలియాకు కూడా వెళ్లడం జరిగిందట. అక్కడ ఉండే మేల్ బోర్న్ స్టేడియంలో భారత్ పార్క్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ ని వీక్షించడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.


టి20 ప్రపంచ కప్ లో టీమిండియా చారిత్రాత్మకు విజయాన్ని అందుకుంది.విరాట్ కోహ్లీ 82 పరుగులతో భారత్ గెలుపుకి కీలకమైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో అందరూ కోహ్లీపై ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ ను స్వయంగా వీక్షించిన సుదీప్ కూడా అక్కడ విరాట్ ఆటను చూసి మెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత తమ వెడ్డింగ్ యానివర్సరీ పురస్కరించుకొని కిచ్చా సుదిప్ తన భార్యతో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు ముఖ్యంగా సుదీర్ కి క్రికెట్ అంటే చాలా ఇస్తామని అందులో కూడా కోహ్లీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పవచ్చు.



సుదీప్ మొదటి నుంచి ఆర్సిబికి మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలో జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచులో సుదీప్ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచారు. మ్యాచ్ అనంతరం తన ట్విట్టర్ నుంచి ఈ విధంగా పోస్ట్ చేస్తూ కింగ్ ఎక్కడ ఉన్న కింగ్ ఏ అంటూ సెల్యూట్ కోహ్లీ ఈ మ్యాచ్ స్టేడియంలో ప్రత్యేకంగా వీక్షించడం విశేషం అని తెలిపారు. హార్దిక్ పాండ్యా టీమిండియా కు హ్యాండ్సప్ అని తన ఆనందాన్ని అక్షరాల రూపంలో తెలియజేశారు. ఇక రక్త చరిత్ర సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: