రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించిన కాంతార ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టించింది. హోంబలే నిర్మించిన కర్ణాటకలో అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా నిలిచింది.కాంతార సినిమా విడుదలైన ప్రతీ చోట సక్సెస్ అవుతుంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు మారుమోగిపోతుంది.ఈ చిత్రం కేరళలో కూడా విజయవంతంగా రన్ అవుతోంది. కాంతార మలయాళంలో విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. సినిమా థియేటర్లు నిండిపోయాయి.14 నుంచి 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ముందుకు సాగుతోంది.కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా మాత్రం ఏకంగా కేజిఎఫ్ 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టి మరో రికార్డ్ సృష్టించింది.


అత్యంత తక్కువ బడ్జెట్ తో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుని ఏకంగా కొన్ని చోట్ల కేజిఎఫ్ 2 సినిమా రికార్డులను బద్దలు కొట్టిందంటే ఇక ముందు ముందు ఎలాంటి రికార్డులను అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో సెప్టెంబర్ 30వ తేదీ విడుదలైనప్పటికీ ఇంకా భారీ మొత్తంలో కలెక్షన్లను రాబడుతుంది.ఇక తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఆలు అరవింద్ కేవలం రెండు కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 15 కోట్ల వరకు లాభాలను అందుకున్నట్టు సమాచారం.కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా అధిక లాభాలను అందుకుంటున్న ఈ సినిమా తాజాగా మరొక రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: