టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా సమంత పేరు పొందింది అయితే తాజాగా తను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది.ఈ విషయం తెలిసిన అభిమానులు, సిని ప్రముఖులు సైతం ఒకసారిగా షాక్కు గురయ్యారు. సమంత చికిత్స తీసుకుంటున్న ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన అభిమానులు స్నేహితులు, సినీ ప్రముఖుల సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉంటున్నారు. సమంత తన ఆరోగ్యం గురించి చేసినట్టు పై తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.


జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ త్వరగా కోలుకో సామ్ నీకు తగినంత బలాన్ని పంపుతున్న అని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే హీరో రామ్ పోతినేని నాని సందీప్ కిషన్ వంటి తదితర హీరోలు కూడా సమంత ట్రీట్ పైన స్పందించడం జరిగింది. ఈ విషయం కూడా ఎప్పటిలాగే గడిచిపోతుంది ఎప్పటిలాగే నువ్వు ఇప్పుడు కూడా మరింత బలంగా తిరిగి వస్తావని రామ్ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. నువ్వు ఎప్పటిలాగానే స్ట్రాంగ్ అయి తిరిగి రావడానికి మేము వేచి చూస్తున్నాం అంటూ హీరో నాని కూడా తన ట్విట్టర్ నుంచి తెలిపారు.


ఇలా అందరూ సోషల్ మీడియా వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఎన్ని రూమర్స్ వచ్చిన సమంత మాత్రం మౌనంగా ఉంటూ వస్తుంది ఆ మధ్య ఒక ఆసక్తికరమైన పోస్టుతో సోషల్ మీడియాకు తిరిగి వచ్చింది. తన పెట్ డాగ్ ఫోటోలు షేర్ చేస్తూ డౌన్.. నాట్ అవుట్ అనే క్యాప్షన్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు తను మయోసైటిన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది అయితే వీటి పైన పలు ఊహాగానాలు కూడా చేస్తున్నారు కొంతమంది నెట్టిజెన్స్. ఒకవేళ ఇది కండరాల బలహీనత ఎక్కువసేపు నిల్చోలేకపోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: