డార్లింగ్ ప్రభాస్ హిట్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు.అందులోనూ పాన్ ఇండియా సినిమాలే..ప్రభాస్ కు బాలివుడ్ లో కూడా మంచి ఫాలొయింగ్ వుంది.అందుకే అక్కడ కూడా వరుస సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నాడు.వరస పెట్టి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు.ఇటీవల వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు దారుణంగా నిరాశపరచడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు..


కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ ప్రభాస్ రేంజ్ మరింత పెంచడం ఖాయమని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తుండగా. ఇందులో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్‌ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్‌ను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.


భారీ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండగా, ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.విడుదలకు ముందే సలార్ సినిమాపై ఏర్పడిన అంచనాలతో ట్రేడ్ వర్గాల్లో భారీ డిమాండ్ అయితే నెలకొంది. ఈ మేరకు సలార్ హక్కుల కోసం గట్టి పోటీ ఏర్పడగా, చివరకు సలార్ శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ చేజిక్కించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటివరకు స్టార్ మా వాళ్ళు భారీ డబ్బుతో హక్కులని చేజిక్కించుకున్న కొన్ని సినిమాల్లో సలార్ టాప్ ప్లేస్ లో ఉందని అంటున్నారు.. ఇది ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి..


హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున సలార్ సినిమాను చిత్రీకరిస్తుండగా, ఇందులో జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ , ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి బస్రూర్ బాణీలు కడుతున్నారు. భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు.ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సినిమా ప్రాజెక్ట్ కే కాగా, ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మరోకీలక పాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు...ఇలా డార్లింగ్ రోజు రోజుకు రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: