కోలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినా దళపతి విజయ్ ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ మూవీbతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. బీస్ట్ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా , పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటించింది.

అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇలా బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను ఈ సంవత్సరం ఇప్పటికే పలకరించిన దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. దళపతి విజయ్ ,  వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ తమిళ్ లో రూపొందుతూ ఉండగా ,  తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల కాబోతోంది. తమిళ్ లో ఈ మూవీ వరసు పేరుతో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు పేరుతో ఈ మూవీ విడుదల కాబోతుంది.

దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికీ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బిజినెస్ ను ఇప్పటికే మూవీ యూనిట్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వరీసు మూవీ తమిళ నాడు థ్రియేటికల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ తమిళనాడు థ్రియేటికల్ హక్కులు దాదాపు 75 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అలాగే ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు కూడా 38 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇలా వరసు మూవీ అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: