తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని పేరు ఉదయ్ కిరణ్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. 'చిత్రం' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ లవర్ బాయ్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో ఆ కాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వెండితెర ఎంట్రీ ఇచ్చి హీరోగా రాణించిన ఉదయ్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించిన హీరో ఈయన. ఒకటి రెండు కాదు.. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్.

కానీ ఈ లవర్ బాయ్ కెరీర్‌లో హైట్స్‌కి ఎంత త్వరగా రీచ్ అయ్యాడో.. అంతే త్వరగా డౌన్ కూడా అయ్యాడు. ఆ తర్వాత పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులు అయిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. అవి అతన్ని ఆత్మహత్య దిశగా ప్రేరేపించాయి. ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. ఆర్ధిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి ఐదున 2014వ సంవత్సరంలో ఉదయ్ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయ్ కిరణ్ మరణించి దాదాపుగా దశాబ్ద కాలం అవుతున్నా సరే అతని విషయంలో అభిమానులు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుపెట్టుకున్నారు. అతని సినిమా వస్తే కచ్చితంగా టీవీలో చూసే పరిస్థితి ఇంకా ఉంది. ఇక అతనికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. భార్య విషయంలో ఇటీవల కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఆమె అమెరికా వెళ్లిపోయారని ప్రచారం కూడా జరిగింది.

సూపర్ హిట్ సినిమాలతో ఆకట్టుకున్న ఉదయ్ కిరణ్ మరి అతని మరణం మాత్రం అభిమానులకు ఇప్పటికీ కష్టంగానే ఉంది. అది చేదు అనుభవాలను మిగిలించింది. ఒక పార్టీలో పరిచయమైన అమ్మాయిని ఉదయ్ కిరణ్ పెళ్లి చేసుకోవడం జరిగింది. సినిమా అవకాశాలు రాకపోయినా సరే ఇద్దరి మధ్య ఎంతగానో అన్యోన్యత ఉండేది. ఉదయ్ కిరణ్ ను మళ్లీ సాధారణ మనిషిని చేయడానికి ఆమె చాలానే కష్టపడింది. కొన్ని రోజుల తర్వాత సాధారణ శక్తికి వచ్చిన అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే ఉదయ్ మరణం తర్వాత ఆమె ఏం చేస్తుంది అనేది చాలామందికి తెలియని విషయం. ఆమె ఉదయ్ మరణించినప్పుడు ఫేస్ బుక్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అనేదానిపై స్పష్టత లేదు. కానీ ఆమె జీతం మాత్రం లక్షల్లో ఉంటుందని అందరికీ తెలుసు. మరీ ఆమె సేవ చేస్తున్నారని సన్నిహితులు కొంతమంది అంటున్నారు. ఆమె ప్రస్తుతం వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు.

ఇప్పటికి అతను అభిమానులకు ఎవర్‌గ్రీన్ హీరో. అయితే ఇటీవల చాలా రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఉదయ్‌ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తేజానే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. కానీ తేజ వాటిని కొట్టిపారేశాడు. తనకు ఆ ఆలోచన లేదని లేల్చి చెప్పాడు

ఉదయ్ తన ఆత్మహత్యకు ముందు రాసిన ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఇది ఉదయ్ కిరణ్ రాసిన లేఖనేనా కాదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: