సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మహేష్ బాబు ఈ సంవత్సరం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు  ఈ మూవీ లో కీర్తి సురేష్ , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా , సముద్రఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

మూవీ లో పూజా హెగ్డే , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ క్రేజీ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. మొదటి షెడ్యూల్లో భాగంగా ఈ మూవీ యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.  మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజ హెగ్డే కూడా ఈ మూవీ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కథ ప్రకారం ఈ సినిమాలో ఒక లేడీ నెగటివ్ పాత్ర ఉంది అని ,  ఆ పాత్ర మూవీ కి  హైలైట్ గా ఉండబోతుంది అని ,  ఆ పాత్రలో మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి ని తీసుకోవాలని ఆలోచనలో మూవీ యూనిట్ ఉంది అని , అందులో భాగంగా ఇప్పటికే మూవీ యూనిట్ ఐశ్వర్య లక్ష్మి ని సంప్రదించారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: