శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ ఆమె టాప్ హీరోయిన్ స్థాయి బాలీవుడ్ అందుకోలేకపోతోంది. ఆమె సరైన కథలను ఎంచుకోలేకపోవడమే దీనికి కారణం అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఆమెకు అనేకసార్లు ఆఫర్స్ కూడ వచ్చాయి.

అయితే ఆమె తన దృష్టి అంతా ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఉందని చెప్పి దక్షిణాది సినిమా రంగం నుండి వచ్చిన ఆఫర్స్ ను సున్నితంగా తిరస్కరించింది అని అంటారు. వాస్తవానికి పూరీజగన్నాథ్ విజయ్ దేవరకొండ తో తీసిన లైగర్ మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. అయితే ఆమె ఆఫర్ ను తిరస్కరించడంతో ఆమె స్థానంలో అనన్యా పాండే వచ్చి చేరింది.

ఈవిషయంలో జాన్వీ ఒకవిధంగా వ్యవహరించింది అన్న కామెంట్స్ కూడ వచ్చాయి. ప్రస్తుతం ఈమెకు బాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్న భారీ సినిమాలలో పెద్దగా ఆఫర్స్ లేవు. దీనితో ఆమె దృష్టి దక్షిణాది సినిమాల పై మళ్ళినట్లు అనిపిస్తోంది. ఈమధ్య ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దక్షిణాది నుండి మంచి అవకాశాలు వస్తే తాను ఆలోచిస్తాను అని చెపుతూ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ దక్షిణాది హీరోలలో అతడి సినిమాలు అంటే తనకు చాల ఇష్టం అని కామెంట్ చేసింది.


దీనితో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న కొరటాల శివ జూనియర్ ల మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటారా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. వాస్తవానికి అలియా భట్ ను జూనియర్ పక్కన హీరోయిన్ గా తీసుకోవాలని మొదట్లో అనుకున్నారు. అయితే ఆమెకు పెళ్ళి జరగడంతోపాటు ఆమె ఇప్పుడు తల్లి కాబోతు ఉండటంతో ఆ ఆలోచన ఆగిపోయింది. ఇప్పుడు జాన్వీ కపూర్ సంకేతాలు ఇస్తూ ఉండటంతో ఆమె గురించి కొరటాల శివ జూనియర్ లు ఆలోచిస్తారేమో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: