ఇప్పుడు శైలేష్ కుమార్ దర్శకత్వంలో హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఈ సందర్భంగా అడవి శేష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అడవి శేష్ మాట్లాడుతూ.. నేను నా జర్నీ గురించి ఆలోచిస్తున్నాను. క్షణం సినిమా వరకు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ సమయంలో అల్లు అర్జున్ ఓ పెద్ద లెటర్ రాసి నాకు సపోర్టుగా నిలిచారు. అలాగే మహేష్ బాబు క్షణం టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు నాతో మేజర్ సినిమా చేసి పాన్ ఇండియాకు పరిచయం చేశారు. ఇలా ఈ ఇద్దరు హీరోలు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ వారిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే హిట్ 2 సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.