కెరియర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకుంటున్న అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్షణం , ఎవరు, గూడచారి వంటి మంచి సినిమా కథలను ఎంచుకొని మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల వచ్చిన మేజర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఉగ్ర మూకల దాడి నుంచి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వీరత్వం పొందిన వీరుని కథలో మనకు కనిపించారు. మేజర్ ఉన్నికృష్ణన్ గా నటించి పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకొని అడవి శేషుకు మరోసారి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఈ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లో కూడా అంతే స్థాయిలో భారీ విజయం సొంతం చేస్తుంది.

ఇప్పుడు శైలేష్ కుమార్ దర్శకత్వంలో హిట్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఈ సందర్భంగా అడవి శేష్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అడవి శేష్ మాట్లాడుతూ.. నేను నా జర్నీ గురించి ఆలోచిస్తున్నాను.  క్షణం సినిమా వరకు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు.  ఆ సమయంలో అల్లు అర్జున్ ఓ పెద్ద లెటర్ రాసి నాకు సపోర్టుగా నిలిచారు.  అలాగే మహేష్ బాబు క్షణం టీజర్ రిలీజ్ చేసి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ బాబు నాతో మేజర్ సినిమా చేసి పాన్ ఇండియాకు పరిచయం చేశారు.  ఇలా ఈ ఇద్దరు హీరోలు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ వారిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు.


ఇకపోతే హిట్ 2 సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: