క్లాసికల్ సినిమాలను రూపొందించే దర్శకులలో ఒకరు పరుశురామ్. గీత గోవిందం సినిమా ఆయనకు ఎంతటి పెద్ద విజయాన్ని తెచ్చి పెట్టిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరశురామ్ ఇటీవల మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమా చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించగా ఇప్పుడు ఆయన తదుపరి చిత్రంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది. కొంతమంది హీరోలతో ఆయన సినిమాలు చేయబోతున్నాడు అని వార్తలు ప్రచారం అవుతున్నాయి.

కానీ పరశురామ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే విషయం మాత్రం ఇప్పటిదాకా వెల్లడించలేదు ఇటీవల నందమూరి బాలకృష్ణ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఓ కథ రెడీ చేసుకో అని చెప్పడం ఎంతో ఆసక్తికరంగా మారింది. పెద్ద దర్శకులను ఏ విధంగా డీల్ చేయాలో తెలిసిన పరుశురామ్ ఈ హీరోతో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇంకొక వైపు విజయ్ దేవరకొండ నాగచైతన్య వంటి హీరోలతో కూడా ఆయన సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మరి ఇన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో త్వరగా ఆయన ఎవరితో తదుపరి సినిమా చేయబోతున్నాడు అన్న విషయాన్ని క్లారిటీ ఇస్తే మంచిది అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సోలో చిత్రంతో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించిన పరుశురామ్ తొలి సినిమాతోనే విజయాన్ని అందుకొని ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చేసిన గీత గోవిందం సర్కారు వారి పాట చిత్రాలు ఆయనను అగ్ర దర్శకుడుగా మార్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొక అగ్ర దర్శకుడు తో ఆయన సినిమా చేస్తాడా లేదా ఒక చిన్న హీరోతోనే సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. దర్శకత్వ లో ఏమాత్రం లోటు లేకుండా సినిమాలను చేసే పరుశురాం సినిమాలలో కథ ఎంతో అద్భుతంగా ఉంటుంది అనేది చాలా మంది చెప్పే మాట

మరింత సమాచారం తెలుసుకోండి: