నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అఖండ సినిమా తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తన 107 వ సినిమా ని మొదలుపెట్టారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం తర్వాత బాలయ్య తన 108వ సినిమా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. వరుసగా హిట్లా మీద జోరు ఉన్న అనిల్ ఈసారి బాలకృష్ణతో సరికొత్త కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.


అనిల్ ఇప్పటికే స్క్రిప్ట్ పరంగా ఈ సినిమా కథను పూర్తి చేసినట్లుగా సమాచారం.కేవలం బాలకృష్ణ కోసమే ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆహా లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ టాక్ షోలో బాలయ్య పలు ఆసక్తికరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటున్నారు. మరి ఈ వేదికపై ఆదిత్య 369 సినిమా సీక్వెల్ పై కూడా మాట్లాడడం జరిగింది. ఈ సినిమా సీక్వెల్ ను ఆదిత్య 999 మ్యాక్స్ అనే పేరుతో తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు.


అంతేకాకుండా ఈ సినిమా కథని తానే స్వయంగా సిద్ధం చేయబోతున్నట్లుగా కూడా తెలియజేయడంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకువెళ్లబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది బాలయ్య. అయితే డైరెక్టర్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొదటిసారి బాలకృష్ణసినిమా కోసం కథను సిద్ధం చేయబోతున్నారు దీంతో బాలయ్య అభిమానులకు కూడా ఈ సినిమా చాలా స్పెషల్ అని కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి బాలయ్య ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: