తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా, రచయితగా నటుడుగా కూడా పూరి జగన్నాధకు మంచి పేరు ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమాతో మొదటిసారిగా డైరెక్టర్ గా పరిచయమయ్యారు పూరి. ఇక తర్వాత మహేష్ బాబుతో పోకిరి సినిమాతో ఒకసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని మార్చేసి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో 33కు పైగా సినిమాలు చేశారు కన్నడలో ఒక సినిమాకి దర్శకత్వం వహించారు.


చివరిగా విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాని తెరకెక్కించి భారీ డిజాస్టర్ ని చవి చూశారు. దీంతో తన తదుపరిచిత్రం జనగణమన సినిమా కూడా వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ పరాజయాలు పొందుతున్న డైరెక్టర్లలో పూరి కూడా ఒకరు. ఎన్నో అంచనాల మధ్య విడుదలవుతున్న సినిమాలన్నీ నిరాశని మిగులుస్తున్నాయి ఒకానొక దశలో సినిమాలు నిర్మించడం వలన రోడ్డును పడ్డ పూరి జగన్నాథ్ ఆ తర్వాత తిరిగి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరొకసారి తన మార్కును చాటుకున్నాడు.
దీంతో మళ్లీ లైగర్ సినిమాతో కష్టాల పాలయ్యారు పూరి జగన్నాథ్. ఇక అసలు విషయంలోకి వెళితే పూరి జగన్నాథ్ చిన్న తమ్ముడు సాయి శంకర్ ఇప్పుడు హీరోగా కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నాడు. బయట ప్రపంచానికి తెలియని మరొక తమ్ముడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పెద్దగా బయట ఎవరికీ తెలియకపోయినా అతని పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ తరపున నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తన తమ్ముడు ఒక ఎమ్మెల్యే అని పూరి జగన్నాథ్ ఎప్పుడూ కూడా ఎక్కడ తెలియజేయలేదు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: