మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తూ ఉండగా , మాస్ మహారాజ రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా , బాబీ సింహ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే దర్శకుడు బాబి ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి ని వింటేజ్ లుక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఈ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై మెగా అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా అద్భుతమైన రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఈ మూవీ నుండి ఒక సాంగ్ ను మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వాల్తేరు వీరయ్య మూవీ తో మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: