తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి బుచ్చిబాబు సన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సన మొదట టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటు వంటి సుకుమార్ దగ్గర పని చేశాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఉప్పెన మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

ఉప్పెన మూవీ తో దర్శకుడి గా కెరియర్ ను పెట్టిన బుచ్చిబాబు మొదటి మూవీ తోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేయడం తో , ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలా మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో , ఒక పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించబోతున్నట్లు , అలాగే ఎన్టీఆర్ కూడా ఈ దర్శకుడి తో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.

కాకపోతే ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ , బుచ్చిబాబు కాంబినేషన్ లో మూవీ రావడం కష్టమే అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బుచ్చిబాబు , రామ్ చరణ్ తో మూవీ తెరకెక్కించడానికి ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: