సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఈ సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తేరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ముగిసింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతోంది.

మూవీ రెండవ షెడ్యూల్ లో పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మహేష్ బాబు మరియు పూజ హెగ్డే లపై ఒక ప్రత్యేక సెట్ లో పెళ్లి సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అను ఇమ్మానుయల్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు , ఈ ముద్దు గుమ్మ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో అను ఇమన్యుయల్ నటించబోతున్న వార్త పూర్తిగా అవాస్తవం అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు , ఖలేజా మూవీ లు తెరకెక్కయి. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: