బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అజయ్ దేవ్ గన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజయ్ దేవగన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవ్ గన్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్ లో ఒక కీలకమైన పాత్రలో నటించి , తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవ్ గన్ "దృశ్యం 2" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అజయ్ దేవ్ గన్ భార్య పాత్రలో శ్రేయ నటించగా.,  పోలీస్ ఆఫీసర్ పాత్ర లో టబు నటించింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే దృశ్యం పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో దృశ్యం పార్ట్ 2 మూవీ పై హిందీ సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దృశ్యం 2 మూవీ 2 గంటల 22 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మరి దృశ్యం 2 మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: