కొన్ని సంవత్సరాల క్రితం వరుస మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగిన సదా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సదా , నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం మూవీ తో హీరోయిన్ గా కెరియర్ ను మొదలుపెట్టింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. అందులో భాగంగా అనేక తెలుగు మూవీ లలో నటించిన సదా ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది.  సదా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమా లలో హీరోయిన్ గా నటించి , తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం సదా వరుస సినిమాల్లో నటించకపోయినప్పటికీ అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే డీ డాన్స్ ప్రోగ్రాం కు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సదా అలరిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సదా వ్యక్తిగత బంధాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక పోస్ట్ చేసింది.సదా తాజాగా వ్యక్తిగత బంధాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... మనలో చాలా మంది వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోతారేమో అని చాలా భయపడుతూ ఉంటారు. మీ ఎదుగుదలకు అడ్డువచ్చే వ్యక్తులను మీరు సున్నితంగా తిరస్కరించడం చాలా మేలు. మన జీవితంలో రకరకాల మనుషులు వస్తుంటారు ... పోతుంటారు. కానీ ఆఖరుకు మనతో ఉండేది మనం మాత్రమే.  లైఫ్ చాలా చిన్నది. బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే సంతోషంగా ఒంటరిగా ఉండడం చాలా మంచిది అని సదా తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: