సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు అంతా కృష్ణ భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈరోజు ప్రభుత్వ లాంచనాలతో కృష్ణ అంత్యక్రియలు జరగబోతున్నాయి. నిన్నటిరోజున కృష్ణ మృతి పై సంతాపం తెలుపుతూ ఎందరో ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియ చేసినప్పటికీ ఆ సంతాప సందేశాలలో రామ్ గోపాల్ వర్మ సంతాప సందేశం డిఫరెంట్ గా ఉండటంతో అతడి సంతాప సందేశం క్షణాలలో వైరల్ గా మారింది.


కృష్ణ మరణించినందుకు ఎవరూ బాధపడవద్దు అంటూ వర్మ విభిన్నంగా స్పందించాడు. ‘కృష్ణ  గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వాళ్లిద్ద‌రూ కలిసి స్వ‌ర్గంలో పాట‌లు పాడుతూ, నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతుంటారని అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేస్తూ ఈపాటికి విజయనిర్మల స్వర్గంలో కృష్ణను చూసి ‘వస్తాడు నారాజు ఈరోజు’ అంటూ పాట పాడుకుంటూ ఉంటుంది అంటూ వర్మ చేసిన ట్విట్ కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది.


అంతేకాదు కృష్ణ విజయనిర్మల ‘మోసగాళ్లకు మోసగాడు’ మూవీలో పాడుకున్న ‘కోరినది నెరవేరినది’ పాట వీడియోను కూడ సోషల్ మీడియాలో వర్మ షేర్ చేయడంతో నెటిజన్స్ వర్మ తెలివితేటల పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి మరణం కూడ తనకు పబ్లిసిటీగా మార్చుకునే విషయంలో వర్మ చాల తెలివైన వాడు.  


ఇదే సంవత్సరం చాల తక్కువ సమయంలో కృష్ణ కృష్ణంరాజులు మరణించడంతో అలనాటి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ స్వర్ణయుగానికి చెందిన సీనియర్ హీరోల శకం పూర్తి అన్న అయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత తరం హీరోలు అంతా తమ ఆస్థులను తమ మనీ బ్యాలెన్స్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నిర్మాతల గురించి ఆలోచించే సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరోలు ఇక మళ్ళీ రావడం అసాధ్యం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: