ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోకిరి నుంచి లేటెస్ట్‌గా ప్రభాస్ వర్షం వరకు రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందాయి.అల్లు అర్జున్,శృతి హాసన్ నటించిన రేసు గుర్రం సినిమాగురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బ్లాక్ బస్టర్ సినిమా రేసు గుర్రం మళ్లీ థియేటర్లలో విడుదలకానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.


అయితే ఈ సినిమా ఎప్పుడు రీరిలీజ్ కానుందనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అల్లు అర్జున్ నటించిన పుష్ప 1 త్వరలో రష్యాలో కూడా విడుదలకానుందని తెలుస్తోంది. ఈ వచ్చే డిసెంబర్‌లో అక్కడ విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారట దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ రష్యా వెళ్తున్నారట..ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి..కాగా, ఈ సినిమా గురించి ఒక రుమెర్ చక్కర్లు కొడుతోంది.


పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్‌లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. ఈ ఒక్క సీన్‌ను షూట్ చేసేందుకు టీమ్ థాయ్‌ల్యాండ్ వెళ్లనుందని తెలుస్తోంది..ఈ సినిమాలో సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుందని తాజా టాక్. ఆమె ఓ 10 నిమిషాల పాత్రలో మెరవనుందట. కథను మలుపుతిప్పే పాత్రలో సాయి పల్లవి నటించనుందని, ఆమె గిరిజన యువతి పాత్రలో కనిపించనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది..చూడాలి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందొ చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: