కన్నడ హీరోయిన్ రష్మిక తాజాగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. మిషన్ మజ్ను సిద్ధార్థ మల్హోత్రా హీరో గా నటిస్తున్న ఈ సినిమాను శంతను బాగ్చీ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మొదటి సినిమా ఇదే ఈ సినిమా లేట్ అవ్వడం వల్ల అమితాబచ్చన్ తో నటించిన గుడ్ బై సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మిషన్ మజ్ను సినిమా స్పై థ్రిల్లర్ సినిమా కావడంతో ఈ సినిమాని థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటి లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


బాలీవుడ్లో ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి కాబట్టి థియేటర్ రిలీజ్ అయినా కూడా పెద్దగా లాభం లేకపోవడంతో ఈ సినిమా చిత్ర బృందం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే బాలీవుడ్లో స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలనుకుంటున్న రష్మిక ఆశలకు బ్రేకులు పడుతున్నాయని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మిషన్ మజ్ను ఓటీటి లో విడుదల అవ్వగా అది అంతగా రష్మిక కెరీర్ కు ఉపయోగపడే అవకాశం లేదని సమాచారం.


ఈ చిత్రం తరువాత డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో యానియల్ మూవీలో నటిస్తున్నది. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పైన రష్మిక ఆశలు పెట్టుకున్నది. ఇక మిస్టర్ మజ్ను సినిమా ఎలాగో ఓటేటిలో విడుదలవుతోంది కాబట్టి ఈ ఫలితం గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని సమాచారం ఇక అర్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతోనైనా ఈ ముద్దుగుమ్మకు లక్  కలిసేస్తుందేమో చూడాలి మరి. మరొకపక్క తమిళ్ ,తెలుగు అంటే భాషలలో కూడా రష్మిక పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో రష్మిక భాగం కాబోతోంది. దీంతో ఈమె నేషనల్ క్రష్ గా కూడా పేరుపొందింది. కానీ బాలీవుడ్ లో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: