అనుపమ పరమేశ్వరన్..ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.ఆ సినిమా ఓ మాదిరి టాక్ ను అందుకుంది.ఆ తర్వాత వరుస క్రేజీ ప్రాజెక్ట్ లలో నటించి మెప్పించింది..అ ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమె సినిమాకు ప్లస్ అయ్యింది.తక్కువ సమయంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది.ఇక ఇటీవల యంగ్ హీరో నిఖిల్ సరసన కార్తీకేయ 2 లో నటించి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డీజే టిల్లు సిక్వెల్ లో నటిస్తుంది. అయితే ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది అనుపమ.. లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది.


ఇక నెట్టింట నిత్యం సందడి చేసే అనుపమ.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది.ఇప్పటికే హీరోయిన్స్ ఇన్ స్టా పోస్టుల ద్వారా ప్రతి ఏడాది రూ. 50 లక్షలకు పైగానే ఆదాయాన్ని సంపాదించుకున్నారు. ఇక కొందరు యూట్యూబ్ ద్వారా కూడా అర్జి్స్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు వారికి నచ్చిన కంటెంట్ ను పోస్ట్ చేస్తూ మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా అదే తరహాలో వ్లాగ్ వీడియో చేస్తూ యూట్యూబ్లో ఫాలోవర్స్ పెంచే పనిలో పడింది..


తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మొదటి వ్లాగ్ వీడియోను షేర్ చేసింది. ఇటీవల ఒక సాంగ్స్ కోసం పోలాండ్ వెళ్లిన అనుపమ.. అక్కడ షూటింగ్ బ్రేక్ ఉన్న సమయంలో పోలాండ్ అందాలను.. అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో బంధించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది..ఎంతైనా అనుపమకు క్రేజ్ ఎక్కువ. చేసింది తక్కువ సినిమాలు అయినా కూడా యూత్ లో మంచి ఫాలొయింగ్ వుంది.నెక్స్ట్ ఎ సినిమా తో అలరిస్తుందొ.. ఎలాంటి టాక్ ను అందుకుంటుందొ చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: