ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం " అవతార్ : ది వే ఆఫ్ వాటర్" కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2009లో వచ్చిన అవతార్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు.. డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగానే విడుదలవుతున్న ఈ సినిమా కోసం అటు భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మొదటిసారి షాక్ ఇస్తూ టికెట్ల రేట్లు ఉండడం చూసి ప్రతి ఒక్కరు మరింత ఆశ్చర్యపోతున్నారు.


నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని థియేటర్లలో అత్యధికంగా రూ.1450 ధరకి ఒక్క టికెట్ అమ్ముడు అవుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా ఈ సినిమా రేంజ్కి తగ్గట్టుగా ఎంత రేట్లు పెట్టినా తక్కువే అని.. కొనుక్కునే వాళ్లు కూడా భావిస్తున్నారు.. అయితే ఈ రేంజ్ లో సినిమా టికెట్ల రేట్లు ఉంటే ఒక మధ్యతరగతి సినీ ప్రేమికుడు ఫ్యామిలీతో కలిసి సినిమా వెళ్లాలంటే చాలా కష్టమవుతుంది.. అత్యధికంగా అయితే ఇండియాలో బెంగళూరులోని ఐమాక్స్ 3D ఫార్మాట్లో ఒక్కొక్క టికెట్ ధర రూ. 1450 గా ఫిక్స్ చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


అలాగే పూణేలో కూడా 4DX,  3D ఫార్మాట్లో విడుదల కాబోతున్న సినిమా టికెట్ ధర రూ.1200 ఫిక్స్ చేశారు అలాగే ఢిల్లీ,  ముంబై , కోల్కతా వంటి నగరాలలో రూ.770 నుంచి 1000 రూపాయల మధ్యలో టికెట్లు ఉండనున్నాయి.  టెక్నాలజీకి తగ్గట్టుగానే డిస్ట్రిబ్యూటర్లు సినిమా టికెట్లను ఫిక్స్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.  ఎక్కువగా ఐమాక్స్ , 3D,  4DX ఫార్మేట్స్ కు అత్యధిక రేట్లు అయితే ఫిక్స్ చేశారు. మరి హైదరాబాదులో 4DX,  3Dఫార్మాట్లో ఒక టికెట్ ధర 350 రూపాయలకు ఫిక్స్ చేయడం జరిగింది . అలాగే వైజాగ్ లో 3Dఫార్మాట్లో రూ. 210 ధరకి టికెట్  అమ్ముతున్నారు. దాదాపు రూ.1600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా మొదటి వారంలోనే ఆ టార్గెట్ పూర్తి చేయబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: