బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా పూర్తి చేయగా ఆ మూవీ 2023 రిపబ్లిక్ డే నాడు రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ తర్వాత షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో జవాన్ మూవీ చేస్తున్నాడు. దళపతి విజయ్ తో వరుసగా 3 సినిమాలు తీసి స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న అట్లీ షారుఖ్ తో చేస్తున్న జవాన్ ని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. హీరోయిన్ గా నయనతారని తీసుకున్నారు.

హీరో మాత్రమే షారుఖ్ సినిమా ఫ్లేవర్ అంతా సౌత్ లానే తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట. మన దగ్గర స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ లేకపోతే కిక్ ఉండదు. అనుకు తగినట్టుగానే జవాన్ లో అట్లీ ఒక క్రేజీ ఐటం సాంగ్ ప్లాన్ చేశారట. అయితే ఈ సాంగ్ లో ఒకప్పుడు తనతో ఆడి పాడిన ప్రియమణిని తీసుకోవాలని సజెస్ట్ చేశాడట షారుఖ్. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో షారుఖ్ ప్రియమణి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే కాంబో రిపీట్ చేస్తూ జవాన్ లో సాంగ్ చేస్తున్నారు.

ఈ సాంగ్ సౌత్ ఆడియన్స్ నే కాదు నార్త్ ఆడియన్స్ ని కూడా పిచ్చెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా సౌత్ ఆడియన్స్ ని నచ్చేలా కూడా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారట. కొన్నాళ్లుగా కెరియర్ లో సరైన హిట్ లేని షారుఖ్ రాబోయే రెండు సినిమాలతో అదరగొట్టాలని చూస్తున్నాడు. షారుఖ్ అట్లీ కాంబో హిట్ అయితే మరికొంతమంది సౌత్ డైరక్టస్ తో బాలీవుడ్ స్టార్స్ సినిమా ప్లాన్ చేస్తారు. మొత్తానికి షారుఖ్ జవాన్ సందడి బాగానే ఉంది. ఈ మూవీతో షారుఖ్ తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: