
నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి లక్షణాలు. పూనమ్ కౌర్ కు ఈ వ్యాధి ఉన్నట్లు నవంబర్ 18న నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్న ఆమె... ఇటీవల కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో కూడా చికిత్స తీసుకుంది. ప్రస్తుతం పుణెలోని తన సోదరి నివాసంలో విశ్రాంతి తీసుకుంటోంది అని తెలుస్తోంది. అయితే పూనమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ ఆమె కుటుంబసభ్యులు మీడియా ప్రతినిధులకు తెలిపారు.
పూనమ్ కౌర్ సంవత్సరం నుంచి చేనేత కార్మికుల కోసం బాగా పోరాడుతోంది. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ జీరో జీఎస్టీ పేరుతో సంతకాలు సేకరిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేనేత ఉద్యమకారుడు వెంకన్న నేతతో కలిసి కృషి చేస్తోంది. 2006లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి పూనమ్ కౌర్, తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు 35కుపైగా చిత్రాల్లో నటించింది. అంతేకాదు, సినిమాకు సంబంధించిన వ్యవహారాల్లో అయినా రాజకీయ విషయాల్లోనైనా తనదైనశైలిలో స్పందిస్తూ సోషల్మీడియాలో యాక్టివ్ ఉంటారు పూనమ్కౌర్.
పూనమ్కౌర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అంటా మరీ
''గత సంవత్సర కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న పూనమ్ కౌర్ నవంబర్ 10వ తేదీన మాతో కలిసి సూరత్ గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టి పన్ను ఎత్తివేయాలని నిరసన కార్యక్రమంలో కూడా ఈ నటి పాల్గొన్నారు. 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం 12వ తేదీ ఢిల్లీలో జరిగే బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆమెకు వెన్ను నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కేరళ వెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే క్రమంలో ఆమెకు 18వ తేదీన ఫైబ్రో మయాల్జియా నిర్ధారణ అయ్యింది. కేరళలో చికిత్స అనంతరం ఆమె ప్రస్తుతం మహారాష్ట్రలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆమె పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఆని కుటుంబసభ్యులు' వెల్లడించాడు.