
ఆ విషయం పక్కన పెడితే కథల ఎంపిక విషయం లో శేష్ ది బెస్ట్ అన్నట్లుగా పేరు దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం అడవి శేష్ కి రెండు కమర్షియల్ బ్లాక్ బస్టర్ లు దక్కాయి. మేజర్ సినిమా ఎంత భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ నమోదు చేసింది. 100 కోట్ల కు పైగా వసూలు నమోదు చేసిన ఆ సినిమా తర్వాత హిట్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని నిర్మించిన ఈ సినిమా కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మొదటి నుండి చెబుతూ వచ్చారు. కానీ కొందరు మాత్రం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. అడవి శేష్ మినిమం గ్యారంటీ హీరో అన్న పేరు దక్కించుకున్నాడు. ఇక నుండి అడవి శేషు ఏ సినిమా చేసిన కూడా అది మినిమంగా ఆడుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఆయన తో సినిమాలు నిర్మించేందుకు.. తెరకెక్కించేందుకు దర్శకులు నిర్మాతలు ముందుకు రాబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.