సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటికే ఈ సంవత్సరం సర్కారు వారి పాట మూవీ తో అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ , మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించగా సముద్ర ఖనిమూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి పరుశురామ్ దర్శకత్వం వహించగా , తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇలా సర్కారు వారి పాట మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళక ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ పూర్తి కాగానే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో జాయిన్ కాబోతున్నాడు. మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ మహేష్ బాబు కెరియర్ లో 29 మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే అద్భుతమైన క్రేజ్ ఉన్న మహేష్ బాబు సూపర్ క్రేజ్ ఉన్న రాజమౌళి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ పై ఇప్పటి నుండే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు రాజమౌళి మూవీ తర్వాత మహేష్ బాబు క్రేజ్ అమాంతం పెరుగుతుంది అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: