తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన రానా ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గాను ... విలన్ గాను ... ఇతర ముఖ్య పాత్రల లోను నటించి దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం దగ్గుబాటి రానా "భీమ్లా నాయక్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ లో రానా తో పాటు పవన్ కళ్యాణ్ కూడా హీరో గా నటించగా సాగర్ కే చంద్ర ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించగా , తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ద్వారా దగ్గుపాటి రానా కు బ్లాక్ బస్టర్ విజయం మరియు సూపర్ క్రేజ్ కూడా లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా దగ్గుపాటి రానా ఇండిగో ఎయిర్లైన్స్ లో ప్రయాణించిన తర్వాత తన లగేజ్ మిస్ అయినందుకు మరియు సిబ్బంది ప్రవర్తన పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం తో ఒక పోస్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా రానా చేసిన పోస్ట్ పై ఇండిగో ఎయిర్లైన్స్ స్పందించింది. తాజాగా రానా చేసిన పోస్ట్ పై స్పందించిన ఇండిగో ఎయిర్లైన్స్ ... సార్ మీ లగేజ్ మీతో పాటు రాలేకపోవడం వల్ల కలిగిన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలను కోరుతున్నాం. మీ లగేజ్ ను మీకు వీలైనంత త్వరగా అందిస్తామని మేము హామీ ఇస్తున్నాం అంటూ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇలా ఇండిగో ఎయిర్లైన్స్ రానా చేసిన పోస్ట్ పై స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: