తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి యు వి క్రియేషన్ సంస్థ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ఇప్పటికే ఎన్నో మూవీ లను నిర్మించింది. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాలను కూడా సాధించాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే యూ వి క్రియేషన్ సంస్థ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో మరియు రాదే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లను నిర్మించి , పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ సంతోష్ శోభన్ అనే యువ హీరో తో కళ్యాణం కమనీయం అనే మూవీ ని తెరకెక్కించింది. సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన కళ్యాణం కమనీయం మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈసారి సంక్రాంతి కి ఈ సినిమాతో పాటు అజిత్ హీరో గా తేరకెక్కిన తునివు , తళపతి విజయ్ హీరో గా తెరకెక్కిన వారసుడు ,  బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన వీర సింహా రెడ్డి , మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ లు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ అన్ని మూవీ లపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ నాలుగు మూవీ ల తర్వాత ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఇలా యూ వి క్రియేషన్ సంస్థ చిన్న హీరో తో ఈ సారి సంక్రాంతి కి పెద్ద ప్రయోగమే చేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: