రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ స్పీడ్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే ఈ సంవత్సరం రాధాకృష్ణ దర్శకత్వంలో తేరకేక్కిన రాధే శ్యామ్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. లవ్ స్టోరీ కథతో తెరకెక్కిన ఈ మూవీ లో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన రాధే శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ "కే జి ఎఫ్" మూవీ తో దేశ వ్యాప్తంగా దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో ప్రభాస్ సరసన అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఈ మూవీ లో జగపతి బాబు ,  పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. రవి బుస్రుర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ మొత్తం షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ వరకు పూర్తి కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ కావడం కే జీ ఎఫ్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: