సీనియర్ నటుడు నరేష్ మరియు ప్రముఖనటి పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో ఎప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు. అయితే కొన్ని రోజుల క్రితం వారి పరువుకి భంగం కలిగించేలా కొన్ని వార్తలు సైతం ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలు తన దృష్టికి రావడంతో పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ కేసును నమోదు చేసింది. ఇక సీనియర్ నటుడు నరేష్ ఈరోజు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. అయితే పలు యూట్యూబ్ ఛానల్ లో వెబ్సైట్ల ఓనర్లపై సీనియర్ నరేష్ పరువు నష్టం దావా వేయడం జరిగింది . మొత్తం 12 మంది పై నరేష్ ఫిర్యాదు చేశారట.

ఇక నరేష్ పవిత్రుల గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేసినందుకు ఈ 12 మంది విచారణకు హాజరు కావలసి ఉందట. ఇక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కి కూడా ఈ నోటీసులు పంపారని సమాచారం వినిపిస్తుంది.ఇలా జరిగిన ప్రచారం వెనుక రమ్య రఘుపతి ఉన్నారని వీరిద్దరూ అనుమానిస్తున్నారు .ఇక వీరిద్దరి వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకోగా తమ గురించి తప్పుగా వైరల్ అవుతున్న వార్తలు విషయంలో ఓపిక నశించడంతో వీరు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. వారి వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్లను కఠినంగా శిక్షించాలని పవిత్ర లోకేష్ మరియు నరేష్ కోరుకుంటున్నారు.

వారికి సంబంధించి ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేయడం వల్ల వారిద్దరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. అంతే కాదు నాంపల్లి కోర్టు ఆదేశాల నేపథ్యంలో అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్ ను ఏ విధంగా స్పందిస్తాయి చూడాలి.వారి ఇమేజ్ డామేజ్ అయ్యేలా వరుస కథనాలు ప్రచారం చేస్తుండడంతో వీరిద్దరూ పోలీసులను కోర్టును ఆశ్రయించారట. ఇదిలావుంటే ఇక ప్రస్తుతం సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దీంతో వీరికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: