టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయినటు వంటి పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తో మంచి విజయం , మంచి గుర్తింపు ను ఈ యువ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించు కున్నాడు. ఆ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కొండ పొలం అనే వైవిధ్యమైన మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ "రంగ రంగ వైభవంగా" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ కేతికా శర్మ , పంజా వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా జీ సంస్థ ఈ మూవీ ని 18 డిసెంబర్ 2022 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం చేయనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా జీ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. మరి థియేటర్ లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: