తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో కెరియర్ ప్రారంభంలో ఎన్నో మూవీ లలో హీరో గా మరియు ఇతర పాత్రలలో నటించినప్పటికీ ఈ సంవత్సరం విడుదల అయిన డీజే టిల్లు మూవీ తో ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు.

మూవీ ద్వారా సిద్దు జొన్నలగడ్డ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే డిజె టిల్లు మూవీ సూపర్ సక్సెస్ ను సాధించడంతో ఈ మూవీ కి సీక్వల్ గా టిల్లు స్కేర్ అనే మూవీ ని ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ ఆఫీసియల్ గా అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ఈ మూవీ లో శ్రీ లీల ను హీరోయిన్ గ తీసుకొని అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ నుండి తప్పుకుంది.

దానితో ఈ మూవీ లో మడోనా సభాష్టియన్ హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ముద్దుగుమ్మ కూడా మూవీ నుండి తప్పుకున్నట్లు దానితో ఈ మూవీలో ప్రస్తుతం వరుస  మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న మీనాక్షి చౌదరి ని హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న కేతిక శర్మ ను ఈ మూవీ లో హీరోయిన్ గా తీసుకొనే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: