దర్శకధీరుడు  రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం ఈ సినిమా సీక్వెల్ చేయాలని ఆలోచనలు ఉన్నాడు. ఇప్పుడు మహేష్ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి తెరకెక్కించే సినిమా ఇదే అనే వార్తలు సైతం ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ కి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన లైన్ చెప్పారని ఆ లైన్ లో తీస్తాయి కధగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించిన ఆ సినిమా కథకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఆలోచిస్తారు. 

త్రిబుల్ ఆర్ సినిమాలో హీరోయిన్ అని ప్రచారం జరిగిన అలియాభట్ ఆ సినిమాలో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించింది.ఇక చరణ్  ఎన్టీఆర్ లలో ఒకరి పాత్ర కొంచెం ఎక్కువగా హైలైట్ అవుతుంది. అయితే ఈ సినిమా  రిలీజ్ సమయంలో రామ్ చరణ్ ఎన్టిఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా జోరుగా తమ హీరో పాత్రే హైలెట్గా నిలిచిందని చర్చ కూడా జరిగింది. స్క్రీన్ స్పేస్ విషయంలో రామ్ చరణ్ పై చేయి సాధిస్తే ఎన్టీఆర్ మాత్రము కేవలం కొమరం భీముడు సాంగ్ తో  ఎక్కువ మార్కులు కొట్టేసాడని ప్రేక్షకుల మధ్య వార్ కూడా జరిగింది.ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ నో తెరకెక్కిస్తే కూడా ఈ అవకాశాలు ఎక్కువగా  ఉన్నట్లుగా తెలుస్తోంది. 

దీంతో ఇప్పుడు రాబోయే త్రిబుల్ ఆర్ సీక్వెల్ సినిమాలో ఇద్దరి పాత్రలను సమానంగా చూపించేలా కథను సిద్ధం చేయాలని చరణ్ తారక్ సీక్వెల్ కు అంగీకరిస్తారా అనే కామెంట్లు సైతం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ సీక్వెల్ విషయంలో రాజమౌళి ముందడుగు వేస్తారా ఆగిపోతారా అన్నది చూడాలి. ఇక బాహుబలి త్రీ సినిమాను తెలకెక్కించాలని జక్కన్న భావిస్తున్నప్పటికీ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో కుదరట్లేదు అని వార్తలు సైతం వస్తున్నాయి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR