తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అయితే అక్కర్లేదు. రష్మిక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది. ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ కూడా తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది రష్మిక. అంతేకాకుండా అందంలో నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ. కాగా తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన తదుపరి సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఒక సినిమాలో రష్మిక మందన్న అంధురాలి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. రష్మిక మందన బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి మిషన్ మజ్ను అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల కానుంది. నెట్ఫ్లిక్స్లో వచ్చే ఏడాది జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అయితే కానుంది.

ఈ సినిమాలో రష్మిక అంధురాలి పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటువంటి రోల్ను రష్మికమొదటిసారి నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్నట్లు గా తెలుస్తోంది. మరి రష్మిక పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి మరి. అయితే ఇప్పటికే సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అని అనుకున్నారట . కానీ ఈ సినిమా ఓటీటీ లోకి డైరెక్ట్ గా విడుదల చేయనున్నారట మూవీ మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: