సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన ఇంకా అందంతో భారీగా క్రేజ్ సంపాదించుకొని కెరీర్ పరంగా ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది. అయితే ఆమె ఇటీవల ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇంతకు ముందు లాగా యాక్టీవ్ గా ఎక్కడా కనిపించకపోవడంతో  అభిమానులు బెంగ పెట్టుకున్నారు.ఇక సామ్‌ తనకు మయోసైటిస్ అనే జబ్బు సోకినట్టు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రాణాంతక వ్యాధి అయినా కూడా త్వరగానే కోలుకుంటానంటూ చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఇంకా సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో వార్త అభిమానులకు షాక్ ఇస్తుంది. అదేంటంటే సమంత ఇప్పట్లో నటించడం కష్టమేనని అందుకే పలు బాలీవుడ్ చిత్రాల నుంచి ఆమెని తీసేశారని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి.


ఇక దీనిపై తాజాగా సమంత టీమ్ స్పందించడం జరిగింది.అలాంటి వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని.. అవన్నీ కూడా పూర్తి అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు.ఈ గుడ్ న్యూస్ వినగానే ఆమె అభిమానులు అబ్బా సాయిరాం అనుకున్నారు. ప్రస్తుతం అనారోగ్య సమస్య కారణంగా ఆమె కాస్త విరామం తీసుకున్నారే తప్ప తను ఏ సినిమా నుంచి తప్పుకోలేదని ఎవరు తనను తీసేయలేదని సమంత టీం వివరణ ఇచ్చింది.ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విజయ్ దేవరకొండతో సమంతసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాకి నిన్ను కోరి, మజిలీ వంటి ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: