అయితే మొదట హీరోయిన్ గా నేహా శెట్టి ప్లేస్ లో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకొచ్చారు. షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి అనుపమ పరమేశ్వరన్ తప్పుకుంది. ఆ తర్వాత మేకర్స్ మరో హీరోయిన్ కోసం వెతకగా ఆ ప్లేస్ లో ప్రేమమ్ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ వచ్చేసిందని ప్రచారం జరిగింది. అయితే ఆమె లుక్ టెస్ట్ తర్వాత తను ఈ క్యారెక్టర్ కు సెట్ కాదని మేకర్స్ తేల్చేశారు. దాంతో తను కూడా సెట్ కాలేదు. తర్వాత మీనాక్షి దీక్షిత్ కోసం టీం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. కానీ సిద్దు జొన్నలగడ్డ, మేకర్స్ ఈ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ మాత్రమే కరెక్ట్ అని ఫీల్ అయ్యారట.
ప్రస్తుతం ఆమె ఏ సమస్య కారణంగా బయటకు వెళ్ళిందో కానీ దానిని పక్కన పెట్టి ఇప్పుడు ఆమెనే మళ్లీ ఫైనల్ చేయాలని ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకురావాలని చిత్ర బృందం చర్చలు మొదలుపెట్టినట్టుగా సమాచారం. మరి అనుపమ అంగీకరిస్తుందా ? లేదా? అనేది తెలియాల్సి ఉంది.