బాలీవుడ్ లోకి శ్రీదేవి వారసురాలుగా ఎంట్రీ ఇచ్చి ఎంత ఇమెజ్ సంపాదించిందో జాన్వీ కపూర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇలా వరుసగా బిజీ షెడ్యూల్ తో గడిపేస్తోందిఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సోషల్ మీడియా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ ఆమె చేసే ప్రతి పనిని కూడా వీడియో రూపంలో తెలియజేస్తూ ఉంటుంది.



అంతేకాకుండా వర్కౌట్, డాన్స్ వీడియోలతో పాటు గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. సూపర్ హాట్ ఫోటోలతో జాన్వీ చేసే స్కిన్ షో అభిమానులను చాలా ఉవ్వితలు ఊరిస్తూ ఉంటుంది. ఈమె ఇంస్టాగ్రామ్ లో తాజాగా 21 మిలియన్లు అంటే దాదాపుగా రెండు కోట్ల 10 లక్షల మంది ఫాలోవర్స్. ఇక సోషల్ మీడియాలో  ఈమె గురించి పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే వాటికి తగ్గట్టుగానే సమాధానం కూడా ఇస్తూ ఉంటుంది జాన్వీ. తనకు వచ్చే  ఇమేజ్ అనేది తన వ్యక్తిత్వం అని.. సినిమాలతో దానికి సంబంధం లేదని తెలియజేస్తోంది.


ఇలాంటి సోషల్ మీడియా వ్యవహారాలు తన వ్యక్తిగత క్రేజ్ కు బ్రాండ్ ప్రమోషన్స్ కు మాత్రమే పనిచేస్తుందని సినిమా విజయాన్ని అది ఏమాత్రం నిర్ణయించదని తెలియజేసింది. ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం జాన్వి చేసిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం మీలీ ఈ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆశించినంతగా కలెక్షన్లు రాలేదని చెప్పవచ్చు. మరి టాలీవుడ్ లో ఈమె ఇంటర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: