
రాజావారు రాణిగారు , ఎస్ఆర్ కళ్యాణమండపం , నేను మీకు బాగా కావాల్సిన వాడిని వంటి చిత్రాలతో ప్రేక్షక ఆదరణ పొందిన కిరణ్ అబ్బవరం.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నాడు.. ఈ క్రమంలోనే ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా.. కాశ్మీరా పరదేశి హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన వచ్చే యేడాది విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 పిక్చర్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మిస్తుండగా మెగానిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. విలేజ్ డ్రామా నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాల హడావిడి ఉండడంతో ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా అయినా కిరణ్ కి భారీ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.