సినీ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అప్పట్లో సమంత మరియు నాగచైతన్య ఇద్దరు విడాకులు తీసుకుంటారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆయన ఫేమస్ అయిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలకి సంబంధించిన జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయిన వేణు స్వామి తాజాగా రష్మిక మందన గురించి ఆసక్తికరమైన కామెంట్లను చేశాడు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ జాతక ప్రభావం రష్మిక మందన మీద పడింది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

అందుకుగాను రష్మికకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ కలిసి ఉంటే గనక రష్మిక కి గుడ్ టైం ఎప్పటికీ రాదు అని వీరిద్దరి జాతకాలు ఇలాగే ఉంటాయని అన్నాడు. వీటితోపాటు వేణు స్వామి రష్మిక మందన మీద వస్తున్న కాంట్రవర్సీల గురించి కూడా మాట్లాడుతూ ఇదంతా జాతక ప్రభావమే అని చెప్పాడు. ఇదంతా చూస్తుంటే రష్మిక మందనకి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇటీవల రష్మిక మందన కాంతార సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇక రష్మిక మందన సినిమాల విషయానికి వస్తే సినిమాలు కూడా రష్మికకి పెద్దగా కలిసి రావడం లేదు అని చెప్పాలి. బాలీవుడ్లో ఆమె నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వరుసగా ఫ్లాపులను అందుకుంటున్నాయి. ఇక తెలుగులో ఎలాంటి సినిమాలను కూడా చేయడం లేదు రష్మిక. ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నప్పటికీ పుష్ప 2 సినిమా ఎప్పటికీ ప్రారంభం అవుతుందో ఎవరికీ తెలియదు. దీంతో వేణు స్వామి రష్మిక మందన పై చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: